అత్తారింట్లో మొదటి రోజు కొత్తకోడలి వింత నిర్వాకం.. అర్ధరాత్రి 12 గంటలకు నిద్రలేచి అంతా నిద్రపోతుండగా..

ABN , First Publish Date - 2022-04-28T21:01:20+05:30 IST

వివాహం చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన నవవధువు.. 24 గంటలు కూడా గడవకముందే అందరికీ షాకిచ్చింది. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉండటాన్ని గమనించి.. తన పని కానిచ్చింది. వరుడు, అ

అత్తారింట్లో మొదటి రోజు కొత్తకోడలి వింత నిర్వాకం.. అర్ధరాత్రి 12 గంటలకు నిద్రలేచి అంతా నిద్రపోతుండగా..

ఇంటర్నెట్ డెస్క్: వివాహం చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన నవవధువు.. మొదటి రోజే వింత నిర్వాకం చేసింది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు నిద్రలేచి తన పని కానిచ్చింది. వరుడు, అతడి కుటుంబ సభ్యులను ఇంట్లో లాక్ చేసి అందరినీ కంగుతినిపించింది. ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


ఆగ్రాకు చెందిన ఆ యువకుడు స్వర్ణకారుడుగా పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తనకు పరిచయం అయ్యాడు. తన మరదలికి పెళ్లి సంబంధాలు చూస్తుంటున్నట్టు పేర్కొన్నాడు. దీంతో యువకుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపించాడు. యువతి కుటుంబం పెళ్లి ఖర్చులు భరించలేదని తెలసి, మొత్తం ఖర్చు తానే చూసుకుంటానని మాటిచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 25న వరుడు తన కుటుంబ సభ్యులతో గోరఖ్‌పూర్ వెళ్లి, సంప్రదాయబద్ధంగా యువతిని పెళ్లి చేసుకున్నాడు. 



వివాహం అనంతరం ఆ వనవధువు వరుడితో కలిసి ఏప్రిల్ 26న ఆగ్రా చేరుకుంది. అత్తారింట్లో అడుగు పెట్టింది. ఆ రోజు రాత్రే నవవధువు అత్తారింట్లో ఉన్న వారందరికీ షాకిచ్చింది. అర్ధరాత్రి వేళ వరుడు సహా అతడి కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండటాన్ని గమనించి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బును బ్యాగులో సర్ధుకుంది. అనంతరం కుటంబ సభ్యులను ఇంట్లో లాక్ చేసి అక్కడ నుంచి పారిపోయింది. అయితే వధువు ఇంట్లో లేని విషయాన్ని గుర్తించిన వరుడి కుటంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కాగా.. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2022-04-28T21:01:20+05:30 IST