శోభనం గదిలో ఉండగా సడన్గా కరెంట్ కట్.. ఉక్కపోస్తోందని డాబా మీదకు వెళ్లిన భర్త.. తిరిగొచ్చాక ఊహించని షాకిచ్చిన వధువు..!
ABN , First Publish Date - 2022-06-02T22:38:35+05:30 IST
పెళ్లి బంధంతో ఒక్కటైన జంటను.. కుటుంబ సభ్యులు శోభనం గదిలోకి పంపించారు. ఇంతలో అకస్మాత్తుగా కరెంట్ కట్ అయింది. ఎండాకాలం కావడంతో వరుడు చల్లగాలి కోసం డాబా మీదకు వెళ్లాడు. కొద్ది సమయం తర్వాత తిరిగి
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి బంధంతో ఒక్కటైన జంటను.. కుటుంబ సభ్యులు శోభనం గదిలోకి పంపించారు. ఇంతలో అకస్మాత్తుగా కరెంట్ కట్ అయింది. ఎండాకాలం కావడంతో వరుడు చల్లగాలి కోసం డాబా మీదకు వెళ్లాడు. కొద్ది సమయం తర్వాత తిరిగి గదికి వెళ్లాడు. అనంతరం వధువు ఇచ్చిన షాక్కు విస్తుపోయాడు. పోలీస్ స్టేషన్కు పరుగులు తీశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన రింకూ సింగ్ అనే వ్యక్తికి కుషీనగర్ జిల్లాకు చెందిన కాజల్ అనే యువతితో కొద్ది రోజుల క్రితం వివాహం జరిగింది. సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత రింకూ సింగ్.. కాజల్ను తీసుకుని తన ఇంట్లో అడుగు పెట్టాడు. ఈ క్రమంలో రింకూ సింగ్ కుటుంబ సభ్యులు నూతన వధూవరులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మొదటి రాత్రికి సంబంధిన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నూతన వధూవరులు శోభనం గదికి వెళ్లన కొద్ది సమయానికే అకస్మాత్తుగా పవర్ కట్ అయింది.
దీంతో ఉక్కపోత తట్టుకోలేక చల్లగాలి కోసం వరుడు డాబా పైకి వెళ్లాడు. కొంత సమయం తర్వాత తిరిగి గదికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో గదిలో వధువు కనిపించకపోవడంతో కంగుతిన్నాడు. ఆమె కోసం చుట్టు పక్కల ఇంట్లో వెతికి.. విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వాళ్లు కూడా ఆమె కోసం గాలించారు. అయితే ఆమె జాడ తెలియకపోవడంతోపాటు.. ఇంట్లో ఉన్న డబ్బు, నగలు వధువు ఎత్తుకెళ్లిందని గ్రహించి వారంతా విస్తుపోయారు. దీంతో రింకూ సింగ్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. వరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు.