Newlywed Woman: భవిష్యత్ గురించి ఈ 19 ఏళ్ల యువతి ఎన్ని కలలు కని ఉంటుందో.. కానీ పెళ్లయిన 7 నెలలకే ఇలా జరిగిందేంటి..!
ABN , First Publish Date - 2022-07-23T20:52:52+05:30 IST
ఆ యువతికి ఏడు నెలల క్రితం వివాహం జరిగింది.. ఎన్నో కలలతో మెట్టినింట అడుగు పెట్టిన యువతికి అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి.
ఆ యువతికి ఏడు నెలల క్రితం వివాహం జరిగింది.. ఎన్నో కలలతో మెట్టినింట అడుగు పెట్టిన యువతికి అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి.. అదనపు కట్నం కోసం అత్తమామలు, భర్త ఆమెను వేధించడం ప్రారంభించారు.. చివరకు ఆమెను సజీవ దహనం చేసి ఇంటి నుంచి పరారయ్యారు.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.. బీహార్ (Bihar) లోని ముజ్ఫర్ పూర్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Brazil Model: హాట్ మోడల్కు చేదు అనుభవం.. షాపింగ్ మాల్ నుంచి గెంటేసిన సిబ్బంది..
ముజఫర్పూర్ జిల్లాలోని నీమతాలా చౌక్కి చెందిన కృష్ణ కుమార్ అనే వ్యక్తి ఏడు నెలల క్రితం జూలీ కుమారి (19)ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాతి రోజు నుంచే జూలీ కుమారికి వేధింపులు ప్రారంభమయ్యాయి. రూ.లక్ష అదనపు కట్నంగా కావాలని కృష్ణ కుమార్ అడగడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు కూడా లక్ష రూపాయలు తీసుకురావాలని జూలీని ఒత్తిడి చేశారు. ఆర్థిక కష్టాల కారణంగా జూలీ తల్లిదండ్రులు ఆ డబ్బును సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో జూలీకి అత్తింట నరకం మొదలైంది. ఆమెను భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు.
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో జూలీని భర్త, అత్తమామలు సజీవ దహనం చేశారు. ఇంట్లో నుంచి మంటలు రావడంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే జూలీ ఒళ్లంతా కాలిపోయింది. కొద్దిసేపటికి ఆమె మరణించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జూలీ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. పరారీలో ఉన్న కృష్ణ కుమార్, అతని తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.