రాత్రి పూట భార్య వాంతులు చేసుకుంటోంటే చూసిన భర్త.. ఏమైందని అడిగితే ఆమె చెప్పింది విని వెన్నులో వణుకు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-12T01:01:52+05:30 IST

ఏడాది క్రితమే ఆ ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి తమ జీవితాల్లో కొత్త పేజీని తెరిచారు. ఈ క్రమంలో ఓ పని మీద బయటకు వెళ్లి, రాత్రయ్యాక తిరిగొచ్చిన భర్త.. తన భార్య వాంతులు చేసుకోవడాన్ని గమనించాడు. దీంతో అతడు విషయం ఏం

రాత్రి పూట భార్య వాంతులు చేసుకుంటోంటే చూసిన భర్త.. ఏమైందని అడిగితే ఆమె చెప్పింది విని వెన్నులో వణుకు.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఏడాది క్రితమే ఆ ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి తమ జీవితాల్లో కొత్త పేజీని తెరిచారు. ఈ క్రమంలో ఓ పని మీద బయటకు వెళ్లి, రాత్రయ్యాక తిరిగొచ్చిన భర్త.. తన భార్య వాంతులు చేసుకోవడాన్ని గమనించాడు. దీంతో అతడు విషయం ఏంటా అని ఆరా తీశాడు. ఏం జరిగిందంటూ ఆమెను ఆడిగాడు. ఈ నేపథ్యంలో ఆమె చెప్పింది విని అతడు షాకయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆమె వాంతులు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన 20ఏళ్ల యువతి.. ఏడాది క్రితం ఆమె తండ్రి చూసిన వాడితో తాళికట్టించుకుంది. ఈ క్రమంలో భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. ఆదివారం రాత్రి అకస్మాత్తుగా వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. అది గమనించిన సదరు యువతి.. భర్త విషయం ఏంటని ఆరా తీశాడు. ఈ నేపథ్యంలో ఆమె చెప్పింది విని.. అతడికి వెన్నులో వణుకొచ్చింది. విషం తాగినట్టు చెబుతూ స్పృహ కోల్పోయిన  భార్యను చూసి అతడు భయాందోళనలకు గురయ్యాడు. అనంతరం హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. ఈ క్రమంలో ఆమెకు చికిత్స చేసిన వైద్యులు.. తాగిన విషాన్ని బయటకు తీశారు. కాగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉంటే.. కూతురు విషం తాగినట్టు తెలిసిన ఆమె తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. అంతేకాకుండా.. తన కూతురు ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం ఆమె మామే అని ఆయన ఆరోపించాడు. అతడు తన కూతురిని వేధించడంవల్లే ఆమె విషం తాగిందని మండిపడ్డాడు. అంతేకాకుండా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2021-10-12T01:01:52+05:30 IST