HYD : ఆ ఫ్లాట్‌లో తల్లీకొడుకులే ఉంటారు.. ఏమైందో ఏమో కానీ ఐదు రోజులుగా బయటికి రావట్లేదు.. ఏదో దుర్వాసన.. తీరా చూస్తే..

ABN , First Publish Date - 2022-05-15T12:38:35+05:30 IST

ఆ ఫ్లాట్‌లో తల్లీకొడుకులే ఉంటారు.. ఏమైందో ఏమో కానీ ఐదు రోజులుగా బయటికి రావట్లేదు.. ఏదో దుర్వాసన.. తీరా చూస్తే..

HYD : ఆ ఫ్లాట్‌లో తల్లీకొడుకులే ఉంటారు.. ఏమైందో ఏమో కానీ ఐదు రోజులుగా బయటికి రావట్లేదు.. ఏదో దుర్వాసన.. తీరా చూస్తే..
FILE PHOTO

  • అమ్మ మృతదేహం పక్కనే..
  • ఐదు రోజులుగా బయటకు రాని తల్లీకొడుకులు
  • ఫ్లాట్‌లో నుంచి దుర్వాసనతో పోలీసులకు ఫిర్యాదు
  • వచ్చి చూస్తే శవమై ఉన్న తల్లి
  • కుమారుడే హత్య చేసి ఉంటాడని అనుమానం

హైదరాబాద్ సిటీ/మల్కాజిగిరి : ఆ ఫ్లాట్‌లో తల్లీకొడుకులే (Mother and Son) ఉంటారు. ఏమైందో ఏమో కానీ ఐదు రోజులుగా ఎవరూ బయటకు రాలేదు. శుక్రవారం ఆ ఫ్లాట్‌ నుంచి ఏదో దుర్వాసన. అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి పోలీసులు (Police) తలుపులు ఎంత కొట్టినా తెరవలేదు. కాసేపటికి కుమారుడు తలుపు తెరిచాడు. ఇంట్లో తల్లి శవమై కనిపించింది. స్థానికులు, పోలీసులు నిర్ఘాంతపోయారు. మల్కాజిగిరి విష్ణుపురి అపార్ట్‌మెంట్‌లో మహిళ (Women) మృతదేహం కలకలం రేపుతోంది. కుమారుడే ఆమెను హత్య (Murder) చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విష్ణుపురిలోని మైత్రీనివాస్‌ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నెంబర్‌ 202లో విజయ (50), ఆమె కుమారుడు సాయికృష్ణ (27) ఉంటున్నారు.


విజయ భర్త రామ్మోహన్‌ 2015లో చనిపోయారు. సాయికృష్ణ బీటెక్‌ (B.Tech) పూర్తి చేశాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎప్పుడూ ఫ్లాట్‌లో పెద్దపెద్ద శబ్దాలు చేయడం, రాత్రిళ్లు అరవడం చేసేవాడు. ఇరుగుపొరుగు తల్లిని ప్రశ్నిస్తే ఆరోగ్యం బాగాలేదని, చికిత్స చేయిస్తున్నట్లు చెప్పేది. కాగా, వారు ఉంటున్న ఫ్లాట్‌ తలుపులు సోమవారం నుంచీ తెరవడం లేదు. శుక్రవారం ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు తలుపులు కొట్టినా తొలుత తెరవలేదు. అరగంట తర్వాత సాయికృష్ణ తలుపులు తెరవడంతో ప్రధాన ద్వారం వద్దే విజయ మృతదేహం పడి ఉంది.


శరీరంపై దుస్తులు లేవు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని విచారించినా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. మానసిక స్థితి సరిగాలేదని, అతడే తల్లిని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా అమ్మ మృతదేహం పక్కనే ఉన్నట్లు తెలుస్తోంది. విజయ రోజూ తన తల్లితో ఫోన్‌ మాట్లాడేదని, సోమవారం చివరిసారిగా మాట్లాడిందని పోలీసులు పేర్కొన్నారు. కానీ, విజయ తల్లి సైతం ఈ మృతి పట్ల స్పందించడం లేదని సమాచారం. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2022-05-15T12:38:35+05:30 IST