పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారండి

ABN , First Publish Date - 2021-12-27T08:54:25+05:30 IST

పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారండి

పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారండి

క్యాబ్‌, ఈ కామర్స్‌, డెలీవరీ సంస్థలకు ఢిల్లీ సర్కారు వినతి


న్యూఢిల్లీ, డిసెంబరు 26: ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందు కు సర్కారు మరో ముందడుగు వేసింది. 2024 నాటికి మొత్తం వాహన కొనుగోళ్లలో 25ు ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉండాలన్న లక్ష్యాన్ని సాధించేలా కార్యాచరణను ప్రారంభించింది. ఇందుకోసం ఈ కామర్స్‌ కంపెనీలు, ఫుడ్‌ డెలివరీ సంస్థలు, క్యాబ్‌ సేవలను అందించేవారు పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని కోరేందుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారడం దశలవారీగా జరుగుతుందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామన్నారు. 

Updated Date - 2021-12-27T08:54:25+05:30 IST