ఎన్జీవోల పిటిషన్లపై సుప్రీంలో విచారణ

ABN , First Publish Date - 2022-01-22T08:02:11+05:30 IST

ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలను అనుసరించి రిజిస్ట్రేషన్‌ రద్దయిన ఎన్జీవోలు దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది...

ఎన్జీవోల పిటిషన్లపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ, జనవరి 21: ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలను అనుసరించి రిజిస్ట్రేషన్‌ రద్దయిన ఎన్జీవోలు దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. జనవరి 24న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి ధర్మాసనం పేర్కొంది. ఎన్జీవోలు విదేశాల నుంచి నిధులు తీసుకోవాలంటే ఎఫ్‌సీఆర్‌ఏ ప్రకారం రిజిస్ట్రేషన్‌/రెన్యువల్‌ చేసుకోవడం తప్పనిసరి. 5,789 ఎన్జీవోలు రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్‌ చేసుకోకపోవడంతో ఎఫ్‌సీఆర్‌ ఏ గుర్తింపు రద్దయింది. మరో 179 ఎన్జీవోల రెన్యువల్‌ దరఖాస్తులను కేం ద్రం తిరస్కరించింది. రిజిస్ట్రేషన్‌ రద్దయిన ఎన్జీవోలు సుప్రీంను ఆశ్రయించాయి.

Updated Date - 2022-01-22T08:02:11+05:30 IST