ఎన్జీవోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆకూరి
ABN , First Publish Date - 2021-11-28T05:55:59+05:30 IST
ఎన్జీవోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆకూరి
మచిలీపట్నం టౌన్, నవంబరు 27: ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆకూరి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. శనివారం ఎన్జీవో కార్యాలయంలో సంఘం తూర్పు కృష్ణాజిల్లా అధ్యక్షుడు ఉల్లి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ ఎన్నికలో నూతనంగా ఎన్నికయిన ఆకూరి శ్రీనివాసరావును పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పి.వి. సాయికుమార్, జేఏసీ కన్వీనర్ దారపు శ్రీనివాస్, ఎ.వెంకటేశ్వరరావు, రమేష్, సీహెచ్ లక్ష్మణరావు, నగేష్, నాగభూషణం, మణికంఠ, బి.శ్రీనివాసరావు, ఎం.వి. అప్పారావు, ప్రసాద్, తోట ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.