ఘోఘా ఓడరేవుకు... NGT కమిటీ క్లీన్ చిట్

ABN , First Publish Date - 2022-05-24T20:46:01+05:30 IST

NGT ఏర్పాటు చేసిన కమిటీ నుండి ఘోఘా ఓడరేవు క్లీన్ చిట్ పొందింది. బీచ్ షిప్ నుండి వ్యర్థాలను "పర్యావరణ అనుకూల పద్ధతిలోనే పారవేసినట్లు తీర్పు చెప్పింది.

ఘోఘా ఓడరేవుకు...  NGT కమిటీ క్లీన్ చిట్

న్యూఢిల్లీ : NGT ఏర్పాటు చేసిన కమిటీ నుండి ఘోఘా ఓడరేవు క్లీన్ చిట్ పొందింది. బీచ్ షిప్ నుండి వ్యర్థాలను "పర్యావరణ అనుకూల పద్ధతిలోనే పారవేసినట్లు తీర్పు చెప్పింది. నివేదిక ప్రకారం...  కమిటీ సభ్యులు స్థానిక అధికారులతో చర్చించడంతోపాటు ఘోఘా ఓడరేవుకు సైట్ సందర్శనను నిర్వహించారు. ఘోఘా ఓడరేవు అధికారులు, డీకమిషన్ అయిన ఓడలు... బీచ్‌లో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపిస్తూ వచ్చిన ప్రైవేట్ ఫిర్యాదు మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ నుండి... క్లీన్ చిట్ ఇచ్చింది.


గత సంవత్సరం, డిసెంబరులో, డోనా పౌలా-II అనే డీకమిషన్ అయిన ఓడను... ఓడరేవులో సముద్రతీరంలో ఉంచడం వల్ల పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్థానిక అధికారులతో కలిసి రాబర్ట్ డ్రావిన్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో... ఎన్‌జీటీ చర్యలు ప్రారంభించింది. కమిటీ సభ్యుల్లో జిల్లా మేజిస్ట్రేట్ అధికారులు, గుజరాత్ మారిటైమ్ బోర్డు సభ్యుడు, రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలోని GCZMA ప్రతినిధులతో పాటు GPCB అధికారి ఉన్నారు. షిప్ బీచింగ్ వల్ల ఆ ప్రాంతంలోని మడ అడవులు దెబ్బతింటున్నాయని, అలాగే సముద్రంలోకి హానికరమైన పదార్థాలు విడుదలవుతున్నాయని, ఈ క్రమంలో... ఆ ప్రాంతంలోని మత్స్యసంపద, జీవవైవిధ్యం దెబ్బతింటున్నాయని డ్రావిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.


ఈ నేపథ్యంలో... జనవరిలో ఎన్‌జీటీ సంయుక్త కమిటీని ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. మే 6 న ప్యానెల్ తన నివేదికను అందించింది. ఈ నివేదిక ప్రకారం... మరమ్మత్తులు, తనిఖీల కోసం... ఘోఘా ఓడరేవులో ఓడను తాత్కాలికంగా లంగరు వేశారు. ఆ తర్వాత దానిని శిధిలం చేసే పని కోసం పంపారు. GMB అధికారులు, ఘోఘా ఓడరేవులో ఉన్నప్పుడు, ఓడ మడ అడవుల నుండి కొంత దూరంలో సముద్రతీరానికి చేరుకుందని, కమిటీ యొక్క సైట్ సందర్శన సమయంలో... సముద్రతీరంలో ఓడ లేదని నివేదిక పేర్కొంది. నిరుడు ఆగస్టులో, GMB... షిప్ కటింగ్ అనుమతిని మంజూరు చేసిందని నివేదిక పేర్కొంది. కటింగ్, బ్రేకింగ్ పనులు అదే నెలలో పూర్తయ్యాయని వెల్లడించింది. 

Updated Date - 2022-05-24T20:46:01+05:30 IST