హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలపై NGT సీరియస్
ABN , First Publish Date - 2022-07-14T20:08:59+05:30 IST
హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ అచేతనత్వంపై మండిపడింది.
న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలపై ఎన్జీటి (NGT) ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ(GHMC) అచేతనత్వంపై మండిపడింది. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పూర్తిస్థాయి నీటిమట్టం స్థాయిలో 8718 చెరువులు, బపర్ జోన్ ప్రాంతంలో 5343 చెరువులు ఆక్రమణలకు గురైనట్లు ఎన్జీటికి జీహెచ్ఎంసీ నివేదిక అందజేసింది. చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న జీహెచ్ఎంసీ నివేదికపై ఎన్జీటి అసంతృప్తి వ్యక్తం చేసింది. మాటలు కాదు...చేతల్లో చూపించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆగస్టు3వ తేదీకి వాయిదా వేసిన ఎన్జీటి... ఆలోగా ఆక్రమణలపై తీసుకున్న చర్యలను నివేదించాలని జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది.