ముంబై కారుబాంబు కేసు.. మరో పోలీస్‌ అధికారి అరెస్ట్..

ABN , First Publish Date - 2021-04-23T23:19:00+05:30 IST

ముంబై కారు బాంబు కేసులో ఎన్ఐఏ అధికారులు మరో పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. ముంబై పోలీస్ క్రైం..

ముంబై కారుబాంబు కేసు.. మరో పోలీస్‌ అధికారి అరెస్ట్..

ముంబై: ముంబై కారు బాంబు కేసులో ఎన్ఐఏ అధికారులు మరో పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. ముంబై పోలీస్ క్రైం బ్రాంచికి చెందిన ఇన్‌స్పెక్టర్ సునీల్ మనే‌కి కారు బాంబు కేసులో ప్రమేయం ఉన్నట్టు ఎన్ఐఏ ఆరోపిస్తోంది. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేను ఎన్ఐఏ అధికారులు మార్చి 13న అరెస్ట్ చేశారు. ఇటీవల కోర్టు ఆయనకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.


ఫిబ్రవరి 25న దక్షిణ ముంబైలో ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు నింపిన ఎస్‌యూవీని నిలిపిన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సదరు కారు యజమాని మన్సుక్ హీరేన్ అనుమానాస్పద మృతి కేసులోనూ వాజే నిందితుడిగా ఉన్నట్టు ఎన్ఐఏ ఆరోపిస్తోంది. ఈ నెల 11న  సచిన్ వాజే సహచరుడైన మరో పోలీసు అధికారి రియాజ్ కాజీని కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వాజేతో పాటు కాజీని కూడా గత నెలలో ముంబై క్రైం బ్రాంచ్ నుంచి తొలగించారు.  

Updated Date - 2021-04-23T23:19:00+05:30 IST