ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు
ABN , First Publish Date - 2021-04-21T06:20:53+05:30 IST
కరోనా ఉధృతిదృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిసు ్తన్నట్లు ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు.
ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్
నిర్మల్ కల్చరల్, ఏప్రిల్ 20 : కరోనా ఉధృతిదృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30 వరకు రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిసు ్తన్నట్లు ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఇందుకోసం గాను ప్రత్యేకటీమ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాత్రి ఎనిమిది న్నర లోపు థియేటర్లు, దుకాణాలు, మద్యం షాపులు, రెస్టారెంట్లు, తదితర వ్యాపార సంబంధించినవి మూసివేయాలని అన్నారు. ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా అత్య వసర సేవలు, మెడికల్ షాపులకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రజ లెవ్వరూ బయట తిరగరాదని అన్నారు. నిర్మల్ పట్టణంలో మంగళవారం రాత్రి నుండి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు.