సీఎం ఒక్కరోజు కమీషన్తో రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ కొనొచ్చు: నిమ్మల
ABN , First Publish Date - 2021-05-11T20:43:13+05:30 IST
జగన్రెడ్డి నిర్లక్ష్యం, ప్రణాళికా లోపంవల్ల.. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని నిమ్మల రామానాయుడు అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్రెడ్డి నిర్లక్ష్యం, ప్రణాళికా లోపంవల్ల.. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరోసభ్యుడు నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం తన సమయాన్ని ప్రతిపక్షాలపై.. కేసులు పెట్టడంపై కాకుండా ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలన్నారు. ముఖ్యమంత్రి ఒక్కరోజు కమీషన్తో రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ కొనొచ్చునని, జగన్ ఒక్కరోజు అవినీతి సంపాదనతో.. రాష్ట్రంలోని కొవిడ్ రోగులందరినీ కాపాడవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. అనేక రాష్ట్రాలు, అక్కడి ప్రభుత్వాలు వ్యాక్సిన్లు కొని ప్రజలకు పంచుతున్నాయని, అక్కడి ప్రతిపక్షనేతలెవరూ ఆ పనిచేయలేదన్న విషయం సీఎం జగన్ గ్రహించాలని రామానాయుడు అన్నారు.