Nagpur సెంట్రల్ జైలులో 9 మంది ఖైదీలకు Covid positive
ABN , First Publish Date - 2022-06-25T17:09:50+05:30 IST
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది....
నాగపూర్(మహారాష్ట్ర):మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నాగ్పూర్ సెంట్రల్ జైలులో 9 మంది ఖైదీలకు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. నాగపూర్ నగరంలో పెరుగుతున్న అంటువ్యాధుల దృష్ట్యా నాలుగు రోజుల క్రితం 12 మంది జైలు ఖైదీలు కొవిడ్ -19 పరీక్షలు చేయించుకున్నారు. శాంపిల్స్లో నలుగురికి పాజిటివ్గా తేలింది. ఆ తర్వాత జైలు అధికారులు కరోనా సోకిన వారితో కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించారు.శుక్రవారం మరో ఐదుగురు ఖైదీలకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. దీంతో జైలులో కరోనా రోగుల సంఖ్య 9కి చేరుకుంది. ఖైదీలకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయి. నాగ్పూర్లో గత 24 గంటల్లో 65 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
శుక్రవారం జిల్లాలో 1,899 నమూనాలను పరీక్షించగా, అందులో ఐదుగురు ఖైదీలతో సహా 65 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది.కరోనా సోకిన వారిలో నాగపూర్ నగరానికి చెందిన 46 మంది, గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 మంది ఉన్నారు.మరో 60 మంది కరోనా రోగులు కోలుకున్నారు. నాగపూర్ నగరంలో 223 మంది, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 132 మందితో సహా జిల్లాలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 355గా ఉంది. నలుగురు కరోనా రోగులను ఆసుపత్రుల్లో అడ్మిట్ చేయగా, మరో 353 మందిని క్వారంటైన్లో ఉన్నారు.