టీఆర్ఎస్ గాలి మాటలు చెప్పే పార్టీ కాదు: మంత్రి నిరంజన్ రెడ్డి
ABN , First Publish Date - 2022-04-26T17:39:31+05:30 IST
తెలంగాణకు అడ్డుపడి, కించపరిచే వాళ్ళు ఏ పార్టీలో ఉన్న అదే రీతిని అవలంభిస్తున్నారని నిరంజన్ రెడ్డి..
హైదరాబాద్: ఆది నుంచి తెలంగాణకు అడ్డుపడి, కించపరిచే వాళ్ళు ఏ పార్టీలో ఉన్న అదే రీతిని అవలంభిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతో పోల్చితే ఏ రాష్ట్రం కూడా దరిదాపున లేదన్నారు. టీఆర్ఎస్ వట్టిమాటలు, గాలి మాటలు చెప్పే పార్టీ కాదన్నారు. దేశ ప్రధానిగా ఉన్న మోదీ.. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా ఎక్కడా అభివృద్ధి కనిపించటం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనపడని వాళ్ళు యాత్రల పేరిట తిరుగుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు.