పీఎన్బీ కుంభకోణం కేసులో Nirav Modi సన్నిహితుడి అరెస్ట్
ABN , First Publish Date - 2022-04-12T15:15:47+05:30 IST
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో నీరవ్ మోదీ సన్నిహితుడిని సీబీఐ భారత్కు తీసుకొచ్చింది....
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో నీరవ్ మోదీ సన్నిహితుడిని సీబీఐ భారత్కు తీసుకొచ్చింది.పీఎన్బీ మోసం కేసులో నీరవ్ మోదీ సన్నిహితుడు సుభాష్ శంకర్ను సీబీఐ కైరోలో అదుపులోకి తీసుకుని మళ్లీ ముంబైకి తీసుకొచ్చింది.పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సన్నిహితుడు సుభాష్ శంకర్ కైరోలో సీబీఐ అధికారులకు దొరికాడు. 2018వ సంవత్సరంలో కేసు నమోదైనప్పటి నుంచి సుభాష్ శంకర్ పరారీలో ఉన్నాడు. అతడు కైరోలో అజ్ఞాతంలో ఉన్నాడని సీబీఐకు అందిన సమాచారం ఆధారంగా సీబీఐ ఈ ఆపరేషన్ నిర్వహించి శంకర్ని పట్టుకుంది. సుభాష్ శంకర్ను ముంబై సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచి, విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నారు.