Nirmal: రియల్టర్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

ABN , First Publish Date - 2021-08-08T17:57:09+05:30 IST

జిల్లాలోని దివ్యానగర్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. రియల్టర్ విజయ్‌చందర్ దేశ్‌పాండేను గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేశారు

Nirmal: రియల్టర్ వ్యాపారి కిడ్నాప్ కలకలం

నిర్మల్: జిల్లాలోని దివ్యానగర్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. రియల్టర్ విజయ్‌చందర్ దేశ్‌పాండేను గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై విజయ్ చందర్ కుటుంబ సభ్యులు దగ్గర్లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ముఠా సభ్యులు ఇంట్లోకి వచ్చి కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమై పోలీసులు మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద చెక్ చేస్తుండగా విజయ్ చందర్ ఆచూకీ లభించింది. దీంతో కిడ్నాప్‎కు పాల్పడిన ముఠాను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

Updated Date - 2021-08-08T17:57:09+05:30 IST