మలేషియాలో నిర్మల్ వాసి మృతి

ABN , First Publish Date - 2021-08-23T17:28:52+05:30 IST

జిల్లాలోని ముధోల్ మండలం ఆష్టానికి చెందిన రాజన్న(42) మలేషియాలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు.

మలేషియాలో నిర్మల్ వాసి మృతి

నిర్మల్: జిల్లాలోని ముధోల్ మండలం ఆష్టానికి చెందిన రాజన్న(42) అనే వ్యక్తి  మలేషియాలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు. రాజన్న జీవనోపాధి కోసం మలేషియా వెళ్లాడు. కాగా రాజన్న మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-08-23T17:28:52+05:30 IST