బైంసా అల్లర్ల బాధితులకు సేవా భారతి బాసట
ABN , First Publish Date - 2021-09-01T16:09:16+05:30 IST
బైంసా అల్లర్ల బాధితులకు సేవా భారతి బాసటగా నిలిచింది.
నిర్మల్: బైంసా అల్లర్ల బాధితులకు సేవా భారతి బాసటగా నిలిచింది. అల్లర్లలో దగ్ధమైన ఇళ్ల స్థానంలో 10 కొత్త ఇళ్లను సేవాభారతి నిర్మించి ఇచ్చింది. బుధవారం ఉదయం 10 కుటుంబాలు తమ కొత్త ఇళ్లల్లో గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి సేవా భారతి జాతీయ ప్రముఖ్ పరాగ్ అభ్యంకర్, ఎంపీ సోయం బాపురావు హాజరయ్యారు.