Nirmal: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన
ABN , First Publish Date - 2022-07-31T04:12:24+05:30 IST
బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఎస్ క్యాటరర్స్ మెస్ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని..
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఎస్ క్యాటరర్స్ మెస్ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భోజనం చేయకుండా మెస్లోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం భోజనం పెడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత మెస్ కాంట్రాక్టర్ను తొలగించి కొత్తవారికి ఇవ్వాలని ఈ-1, ఈ-2 బ్యాచ్ విద్యార్థుల డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు విద్యార్థుల ఆందోళనతో కొత్త మెస్ కాంట్రాక్ట్ కోసం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే అధికారుల ప్రకటనను విద్యార్థులు విశ్వసించడంలేదు. ఫుడ్పాయిజన్కు కారణమైన మెస్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త కాంట్రాక్టర్లను నియమించేంత వరకు కాలేజీ మెస్లో భోజనం చేయబోమంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.