నేడు నిర్మల్ లో బీజేపీ భారీ బహిరంగ సభ
ABN , First Publish Date - 2021-09-17T13:31:49+05:30 IST
జిల్లాలో ఈరోజు బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నంది.
నిర్మల్: జిల్లాలో ఈరోజు బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్తో బీజేపీ సభ నిర్వహించనుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా హాజరుకానున్న నేపథ్యంలో నిర్మల్ సభను బీజేపీ సీరియస్గా తీసుకుంది. అమిత్ షా సభకు అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు హాజరుకానున్నారు. నేడు కాంగ్రెస్ సభ ఉండటంతో నిర్మల్ సభపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమిత్ షానాందేడ్ నుంచి నిర్మల్ సభకు వెళ్ళనున్నారు.