నిర్మల్: జిల్లాలోని కుభీర్ మండలం దోడర్న తండా-4 గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. రాజేందర్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నల్గొండ ప్రాంతానికి చెందిన ఓ యువతిని గర్భవతిని చేసినట్టు రాజేందర్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 21న పెద్దలు పెళ్లికి ఒప్పించగా... ఇంతలోనే పంట చేనులో రాజేందర్ తీవ్ర గాయాలతో చనిపోయి కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.