నిర్మల్: రైతు వేదికపై ప్రధాని చిత్రపటానికి అవమానం
ABN , First Publish Date - 2021-01-25T15:42:01+05:30 IST
జిల్లాలోని తానూర్ మండలం భోల్సాలో రైతు వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి అవమానం జరిగింది.
నిర్మల్: జిల్లాలోని తానూర్ మండలం భోల్సాలో రైతు వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి అవమానం జరిగింది. చిత్రపటాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పేడతో కొట్టారు. విషయం తెలిసిన బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.