నిర్మల్లో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2022-03-03T19:26:37+05:30 IST
జిల్లాలోని కుంటాల మండలం బురుగుపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
నిర్మల్: జిల్లాలోని కుంటాల మండలం బురుగుపల్లి వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు వెనక టైర్ పగిలడంతో ఒకరు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు భైంసా నుంచి నిర్మల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 53 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా... బస్సు నెమ్మదిగా వస్తుండడంతో ప్రమాదం తప్పింది.