గంటన్నర సేపు సాగిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం

ABN , First Publish Date - 2022-02-01T18:17:35+05:30 IST

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం గంటన్నర సేపు సాగింది....

గంటన్నర సేపు సాగిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం గంటన్నర సేపు సాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రసంగాన్ని 11.00 గంటలకు ప్రారంభించిన మంత్రి పన్నెండున్నర గంటలకు ముగించారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ డిడక్షన్ 14 శాతానికి పెంచుకునే అవకాశాన్ని కేంద్రమంత్రి కల్పించారు.ఐటీ రిటర్న్ దాఖలులో వెసులుబాటు కల్పించారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. రిటర్న్ లు సమర్పించిన రెండేళ్ల తర్వాత కూడా సవరణలు చేసుకోవచ్చు. త్వరలో ఈ పాస్ పోర్ట్ విధానం తీసుకువస్తామని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు.


Updated Date - 2022-02-01T18:17:35+05:30 IST