మహిళా సాధికారత కోసం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన నీతా అంబానీ

ABN , First Publish Date - 2021-03-08T01:28:53+05:30 IST

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా ముకేశ్ అంబానీ ఆదివారం మహిళా సాధికారిత కోసం ఓ సోషల్

మహిళా సాధికారత కోసం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన నీతా అంబానీ

ముంబై: రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా ముకేశ్ అంబానీ ఆదివారం మహిళా సాధికారిత కోసం ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘హెర్ సర్కిల్’ను ప్రారంభించారు. మహిళలకు సంబంధించిన విషయాలకు ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ లాంటిది. లక్షలాదిమంది మహిళలకు మద్దతుగా, సంఘీభావంగా ఇలాంటి ‘హెర్ సర్కిల్’‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని నీతా అంబానీ పేర్కొన్నారు. ఈ HerCircle.inలో ప్రతి మహిళ చేరాలని పిలుపునిచ్చారు. 


హెర్ సర్కిల్ సబ్‌స్క్రైబర్లు వీడియోలు వీక్షించొచ్చు. జీవితంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలు-పరిష్కారం, వెల్‌నెస్, ఆర్థికం, పని, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనిటీ సర్వీస్, బ్యూటీ, ఫ్యాషన్, వినోదం, స్వీయ సృజనాత్మకత, మహిళల సారథ్యంలోని స్వచ్ఛంద సంస్థల్లో క్రియాశీలంగా ఉండడం వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి.

Updated Date - 2021-03-08T01:28:53+05:30 IST