IPL 2022: జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ రాణాకు జరిమానా

ABN , First Publish Date - 2022-04-07T22:02:27+05:30 IST

కోల్‌కతా నైట్‌ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నితీశ్ రాణా, జస్ప్రీత్ బుమ్రాలకు జరిమానా పడింది. బుధవారం

IPL 2022: జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ రాణాకు జరిమానా

ముంబై:  కోల్‌కతా నైట్‌ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నితీశ్ రాణా, జస్ప్రీత్ బుమ్రాలకు జరిమానా పడింది. బుధవారం రాత్రి ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు వీరిద్దరూ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారు. ఫలితంగా కోల్‌కతా బ్యాటర్ రాణాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. బుమ్రాను మాత్రం హెచ్చరించి వదిలేశారు. అయితే, వీరు చేసిన నేరం ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు.


ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా బౌలర్ పాట్ కమిన్స్ బ్యాట్‌తోనూ చెలరేగిపోయాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు రాబట్టి జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించాడు. కమిన్స్ బాదుడుతో 162 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్‌కతా 16 ఓవర్లలోనే ఛేదించింది.

Updated Date - 2022-04-07T22:02:27+05:30 IST