నిత్యపూజ ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-08-18T05:02:08+05:30 IST

మండలంలోని రంగనాధ ఆలయంలో బుధవారం నిత్యపూజ ఆలయ చైర్మన్‌గా పాటూరి కొండారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పాలకవర్గ సభ్యులతోనూ కార్యనిర్వహణాధికారి మోహన్‌రెడ్డి చేయించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి, మేడా మధుసూధన్‌రెడ్డిలు హాజరయ్యారు.

నిత్యపూజ ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యం

సిద్దవటం, ఆగస్టు 17: మండలంలోని రంగనాధ ఆలయంలో బుధవారం నిత్యపూజ ఆలయ చైర్మన్‌గా పాటూరి కొండారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పాలకవర్గ సభ్యులతోనూ కార్యనిర్వహణాధికారి మోహన్‌రెడ్డి చేయించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి, మేడా మధుసూధన్‌రెడ్డిలు హాజరయ్యారు. వారికి ఆలయ ఈవో మోహన్‌రెడ్డి శాలువా కప్పి గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ ఏకుల రాజేశ్వర్‌రెడ్డి, రాజంపేట ఇన్స్‌పెక్టర్‌ శివయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T05:02:08+05:30 IST