నిజమాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆర్మీ జవాన్ మృతి

ABN , First Publish Date - 2021-01-15T16:20:59+05:30 IST

జిల్లాలోని ఇందల్వాయి మండలం మేగ్యా నాయక్ తండాకు చెందిన ఆర్మీ జవాన్ దెగవత్ మోతీలాల్ (25) మృతి చెందాడు.

నిజమాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆర్మీ జవాన్ మృతి

నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం మేగ్యా నాయక్ తండాకు చెందిన ఆర్మీ జవాన్ దెగవత్ మోతీలాల్ (25) మృతి చెందాడు.  గత నెల 28న సదాశివనగర్ మండలం దగ్గి వద్ద రోడ్డు ప్రమాదంలో మోతీలాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హైదరాబాద్ ఆర్మీ హాస్పిటల్‌కు తరలించగా... చికిత్స పొందుతూ  ఈరోజు ఉదయం మృతి చెందాడు. ఉత్తరాఖండ్  నుండి పంజాబ్‌కి  బదిలీ కావడంతో  10  రోజులు సెలవుపై ఆర్మీ జవాన్ ఇంటికి వచ్చాడు. అయితే రోడ్డు ప్రమాదానికి గురై చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2021-01-15T16:20:59+05:30 IST