TS News: ఎమ్మెల్సీ కవితను కలిసిన బీసీ నాయకులు
ABN , First Publish Date - 2022-07-23T01:47:38+05:30 IST
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని జిల్లా బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీసీ కులాల నాయకులు శుక్రవారం కలిశారు.
నిజామాబాద్(Nizamabad): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)ను జిల్లా బీసీ ఐక్య వేదిక(bc leaderes) ఆధ్వర్యంలో బీసీ కులాల నాయకులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తమ సమస్యలు విన్నవించడానికి ఎమ్మెల్సీ కవితని కలిసినట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో బీసీ భవన్((bc bhavan) ఏర్పాటు చేయటానికి ఎకరం స్థలం, గృహ(బిల్డింగ్) సముదాయానికి సహకరించాలని, అలాగే బీసీ కులాలకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవితని కోరినట్లు తెలిపారు. బీసీ కులాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని, బీసీ భవన్కు సహకరిస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక సలహదారులు రాజారామ్ యాదవ్, జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, టెలికాం బోర్డు మెంబర్ సతీష్ టక్కూరి, దర్శనం దేవేందర్, లక్మణ్ గౌడ్, చింతా మహేష్ Trsv, లక్ష్మీనారయణ, శ్రీనివాస్ గౌడ్, నక్క లింగారెడ్డి యాదవ్, రామగౌడ్, ఉద్యోగ సంఘాల నాయకులు రేవంత్, నాగరాజు, వినోద్, గట్టు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.