నిజామాబాద్: తొలి వ్యాక్సిన్ వేయించుకున్న శానిటేషన్ వర్కర్
ABN , First Publish Date - 2021-01-16T18:07:04+05:30 IST
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను మంత్రి ప్రశాంత్రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం ప్రారంభించారు.
నిజామాబాద్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను మంత్రి ప్రశాంత్రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి వ్యాక్సిన్ను శానిటేషన్ వర్కర్ అజయ్ వేయించుకున్నారు. అటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ 19 టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. వైద్యులు మొదటి టీకాను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ అజయ్ కుమార్కు వేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ శోభా, జిల్లా కలెక్టర్ శరత్ పాల్గొన్నారు.