TS News: టెర్రరిస్టులకు నిజామాబాద్ జిల్లా అడ్డాగా మారింది: రాజాసింగ్

ABN , First Publish Date - 2022-07-23T23:50:32+05:30 IST

టెర్రరిస్టులకు నిజామాబాద్ జిల్లా (Nizamabad District) అడ్డాగా మారిందని ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) ఆరోపించారు.

TS News: టెర్రరిస్టులకు నిజామాబాద్ జిల్లా అడ్డాగా మారింది: రాజాసింగ్

నిజామాబాద్: టెర్రరిస్టులకు నిజామాబాద్ జిల్లా (Nizamabad District) అడ్డాగా మారిందని ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోధన్‌లో రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇప్పించి.. పునరావాసం కల్పించింది ఎవరు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిఘా వైఫల్యంతోనే రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కేరళ (Kerala)లో సిమి ఆర్గనైజేషన్‌ను బ్యాన్‌ చేస్తే.. నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్‌ఐ పేరుతో వెలిసిందన్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పీఎఫ్‌ఐ (PFI) పథక రచన చేస్తోందని ఆరోపించారు. పథకం ప్రకారమే హిందువులపై దాడులు జరుగుతున్నాయని రాజాసింగ్ తెలిపారు.

Updated Date - 2022-07-23T23:50:32+05:30 IST