నిజామాబాద్: బైక్ను ఢీకొన్న కారు
ABN , First Publish Date - 2021-06-16T16:36:55+05:30 IST
జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు గన్నారంకు చెందిన సాయిలుగా గుర్తించారు. టోల్ప్లాజా అధికారుల నిర్లక్ష్యం వల్ల యూటర్న్ వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారిపై గన్నారం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.