Nizamabad: అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
ABN , First Publish Date - 2021-11-23T16:42:22+05:30 IST
జిల్లాలోని వేల్పూర్ మండలం మోతె వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
నిజామాబాద్: జిల్లాలోని వేల్పూర్ మండలం మోతె వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మనోజ్, శ్రవణ్ అనే ఇద్దరు యువకులు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.