నిజామాబాద్లో తీవ్ర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-04-14T17:33:19+05:30 IST
జిల్లాలోని సిరికొండ మండలం గడ్డమీది తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నిజామాబాద్: జిల్లాలోని సిరికొండ మండలం గడ్డమీది తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుగులోత్ సక్కు(30) అనే వివాహిత పంట పొలాల వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులు వల్లనే చనిపోయిందని పుట్టింటివారు అత్తవారి ఇంటిపై దాడి చేశారు. మృతురాలి బంధువులు అత్తవారింటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో వంట సామాగ్రితో పాటు బైక్, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. తీవ్ర ఉద్రిక్తత నెలకొడంతో తండాలోకి భారీగా పోలీసులు మోహరించారు.