Nizamabad: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2022-04-15T14:04:53+05:30 IST
జిల్లాలోని బాల్కొండ మండలం బుస్సాపూర్ గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
నిజామాబాద్: జిల్లాలోని బాల్కొండ మండలం బుస్సాపూర్ గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 24 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.