Nizamabad: గడ్కోల్ పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-05-26T18:02:10+05:30 IST

జిల్లాలోని మోపాల్ మండలం గడ్కోల్ పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Nizamabad: గడ్కోల్ పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత

నిజామాబాద్: జిల్లాలోని మోపాల్ మండలం గడ్కోల్ పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాళేశ్వరం 21 ప్యాకేజ్ పరిధిలోని మంచిప్ప రిజర్వాయర్ డిజైన్ మార్పును నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు రీడిజైన్ రద్దు చేసే వరకు పనులు అడ్డుకుంటామని ముంపు గ్రామాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Updated Date - 2022-05-26T18:02:10+05:30 IST