నాలుగేళ్ల తర్వాత తెరుచుకున్న నిజాంసాగర్ గేట్లు

ABN , First Publish Date - 2020-10-16T15:27:59+05:30 IST

జిల్లాలోని జుక్కల్‌లో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.

నాలుగేళ్ల తర్వాత తెరుచుకున్న నిజాంసాగర్ గేట్లు

కామారెడ్డి: జిల్లాలోని జుక్కల్‌లో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.  నాలుగేళ్ల తర్వాత నిజాంసాగర్ గేట్లు తెరుచుకున్నాయి.  భారీగా వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 63455 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 64836 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 1403.58 అడుగులకు చేరింది. అలాగే నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 15.77 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2020-10-16T15:27:59+05:30 IST