నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

ABN , First Publish Date - 2020-10-27T07:27:08+05:30 IST

అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను సర్దుబాటు చేయడమే ప్రధాన అజెండాగా వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరగనుంది.

నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం

 హాజరవుతున్న బాలినేని, సజ్జల


నెల్లూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను సర్దుబాటు చేయడమే ప్రధాన అజెండాగా వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం మంగళవారం జరగనుంది. నెల్లూరులోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరిగే ఈ సమావేశానికి జిల్లాఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరవుతున్నారు. జిల్లా మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొనే ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు నేతల మధ్య సఖ్యత కుదిర్చే దిశగా రాజీ ప్రయత్నాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2020-10-27T07:27:08+05:30 IST