వచ్చేనెల 5 నుంచి డీఎడ్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-10-29T10:54:57+05:30 IST

డీఎడ్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నవంబరు 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు

వచ్చేనెల 5 నుంచి డీఎడ్‌ పరీక్షలు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), అక్టోబరు 28:  డీఎడ్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నవంబరు 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో పీ రమేష్‌ బుధవారం  ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.  పరీక్ష రాసే విద్యార్ధులతోపాటు పరీక్షల  అధికారులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. బీఎస్‌ఈఏపీ.ఒఆర్‌జి వెబ్‌సైట్‌లో సెంటర్‌, నామినల్‌ రోల్స్‌ను, హాల్‌టికెట్‌లను డౌన్‌లోడు చేసుకోవాలన్నారు. హాల్‌టికెట్‌లో ఫొటో ప్రింట్‌ కాని అభ్యర్ధులు ఓ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను హాల్‌టికెట్‌పై అతికించి, దానిపై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ సంతకం చేయించి పరీక్షకు హాజరు కావాలని ఆయన కోరారు.


-------------

Updated Date - 2020-10-29T10:54:57+05:30 IST