మైకుల్లో ‘అజాన్‌’ వద్దు: శ్రీరామ సేన

ABN , First Publish Date - 2022-04-05T09:43:30+05:30 IST

మసీదుల్లో నమాజ్‌కు ముందు మై కుల్లో ఇచ్చే ‘అజాన్‌’ను కర్ణాటకలో నిషేధించాలని శ్రీరామసేన డిమాండ్‌ చే సింది.

మైకుల్లో ‘అజాన్‌’ వద్దు: శ్రీరామ సేన

బెంగళూరు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): మసీదుల్లో నమాజ్‌కు ముందు మై కుల్లో ఇచ్చే ‘అజాన్‌’ను కర్ణాటకలో నిషేధించాలని శ్రీరామసేన డిమాండ్‌ చే సింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా శబ్దకాలుష్యాన్ని నివారించేం దుకు అజాన్‌పై నిషేధం విధించాలని శ్రీరామసేన జాతీయ అధ్యక్షుడు ప్రమోద్‌ ముతాలిక్‌ బెంగళూరులో అన్నారు. లేకపోతే తాము కూడా ఆలయాల్లో లౌడ్‌స్పీకర్లు పెట్టి బిగ్గరగా భజనలు చేస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అన్ని ప్రార్థనా మందిరాల్లో అమలయ్యేలా చూస్తామని సీఎం బసవరాజ్‌ బొమ్మై అన్నారు. 


Updated Date - 2022-04-05T09:43:30+05:30 IST