ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ రేటులో మార్పు లేదు : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-03-04T20:46:31+05:30 IST

ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై 2020-21 ఆర్థిక

ఈపీఎఫ్ఓ డిపాజిట్లపై వడ్డీ రేటులో మార్పు లేదు : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా వడ్డీ రేటు 8.5 శాతం అనే సంగతి తెలిసిందే. 


సంతోష్ గంగ్వార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) బోర్డు 2020-21 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించిందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ వడ్డీ రేటు 8.5 శాతమేనని గుర్తు చేశారు. 


ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారుల డిపాజిట్లపై 2020-21 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును నిర్ణయించేందుకు ఈపీఎఫ్ఓ బోర్డు గురువారం శ్రీనగర్‌లో సమావేశమైంది. ఈ వడ్డీ రేటును మార్చరాదని నిర్ణయించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ వడ్డీ రేటు 8.65 శాతం ఉండేది. 



Updated Date - 2021-03-04T20:46:31+05:30 IST