కేసీఆర్తో రాజీ ప్రసక్తే లేదు
ABN , First Publish Date - 2021-03-01T06:24:42+05:30 IST
‘కాంగ్రెస్తో పాటు ఏ పార్టీ గెలిచినా వారు సీఎం కేసీఆర్తో దోస్తీ చేస్తరు.. నేను మాత్రం నో కాంప్రమైజ్’ అని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ స్పష్టంచేశారు.
మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ
త్రిపురారం, ఫిబ్రవరి 28: ‘కాంగ్రెస్తో పాటు ఏ పార్టీ గెలిచినా వారు సీఎం కేసీఆర్తో దోస్తీ చేస్తరు.. నేను మాత్రం నో కాంప్రమైజ్’ అని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ స్పష్టంచేశారు. త్రిపురారం మండలకేంద్రంలో ఆదివారం జరిగిన అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది, ఆశావర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పారిశుధ్య కార్మికుల సమస్యల సాధన సదస్సులో మాట్లాడారు. ఉ ద్యమ సమయంలో తాను అండగా ఉన్నానని, విరమణ సమయంలో నిమ్మరసం ఇచ్చానని గుర్తుచేశారు. దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని మోసపూరిత మాటలు చెప్పారని సీఎం కేసీఆర్ను ప్రశ్నిం చినందుకే తనను రెండుసార్లు జైల్లో పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను నిర్వీ ర్యం చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే శాసనసభను రద్దు చేస్తారా అని ధ్వజమెత్తారు. కుల సంఘ నాయకుడిగా ఉన్నపుడే ఎన్నో పోరాటాలు చేశానని, ఓటుతో అవకా శమిస్తే ప్రజల అకాంక్షలు నెరవేరుస్తానని అన్నారు. సాగర్ ఎన్నికల్లో డబ్బు, మద్యం వచ్చే వారిని నమ్మొద్దని హితవు పలికారు. కార్య క్ర మంలో పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త గొడవర్తి జానకిరామయ్యచౌదరి, నాయకులు మడుపు శ్రీను, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.