TS News: మునుగోడులో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కోదండరాం

ABN , First Publish Date - 2022-08-13T23:26:00+05:30 IST

Hyderabad: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీచేసే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం

TS News: మునుగోడులో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కోదండరాం

Hyderabad: మునుగోడు (Munugodu) నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీచేసే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం (Kodanda Ram) చెప్పారు. టీజేఎస్ (TJS) కార్యాలయంలో ఆయన చేపట్టిన ఒక్కరోజు దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. నాయకుల స్వార్థం కోసమే మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చారన్న విమర్శించారు. ఉప ఎన్నికతో రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజక్ట్ డిజైన్ లోపాలు, అనివీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని మనుగోడు ప్రజలకు వివరిస్తామన్నారు.  

Updated Date - 2022-08-13T23:26:00+05:30 IST