కార్తీక పౌర్ణమి సందర్భగా గంగా స్నానాలకు అధికారులు నో!

ABN , First Publish Date - 2020-11-26T23:40:22+05:30 IST

ఈ నెల 30న కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు గంగానదిలో స్నానాలు చేసేందుకు హరిద్వార్ జిల్లా అధికారులు అనుమతి...

కార్తీక పౌర్ణమి సందర్భగా గంగా స్నానాలకు అధికారులు నో!

హరిద్వార్: ఈ నెల 30న కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు గంగానదిలో స్నానాలు చేసేందుకు హరిద్వార్ జిల్లా అధికారులు అనుమతి నిరాకరించారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సారి పుణ్యస్నానాలను నిషేధించినట్టు అధికారులు ఇవాళ ప్రకటించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏటా ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సహా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం గంగానదీ తీరానికి వస్తారు. అయితే కొవిడ్-19 నేపథ్యంలో కేంద్రం వెలువరించిన మార్గదర్శకాలను అనుసరించి ఈ ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలు నదీస్నానాలు ఆచరించడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్టు హరిద్వార్ జిల్లా కలెక్టర్ సి. రవిశంకర్ పేర్కొన్నారు. పుణ్యస్నానాల కోసం ప్రజలు పెద్దఎత్తున ఘాట్లలో గుమికూడే అవకాశం ఉందనీ... దీనివల్ల వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంగించిన వారికి అంటు వ్యాధుల నిరోధక చట్టం 1897తో పాటు విపత్తుల నిరోధక చట్టం 2005 కింద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2020-11-26T23:40:22+05:30 IST