ప్రేక్షకులు లేకుండా వన్డే సిరీస్‌

ABN , First Publish Date - 2021-02-28T09:38:14+05:30 IST

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య పుణెలో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీ్‌సకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ప్రేక్షకులకు అనుమతి నిరాకరించింది...

ప్రేక్షకులు లేకుండా వన్డే సిరీస్‌

పుణె: భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య పుణెలో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే  సిరీ్‌సకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ప్రేక్షకులకు అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు వికాస్‌ కకాట్కర్‌ శనివారం వెల్లడించారు. వన్డే సిరీస్‌ విషయమై ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రేతో సమావేశమై చర్చించామన్నారు. మ్యాచ్‌లను యధాప్రకారం నిర్వహించుకోవచ్చని సీఎం సూచించారన్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ వచ్చేనెల 23, 26, 28 తేదీల్లో జరగాల్సి ఉంది. కానీ పుణెతోపాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తుండడంతో వన్డే సిరీస్‌ కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.  


Updated Date - 2021-02-28T09:38:14+05:30 IST