Maskలు ధరించని 3 వేలమందికి Fine

ABN , First Publish Date - 2022-07-08T14:45:40+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో, వాహనాల్లో సంచరించిన మూడువేలమందికి తలా రూ.500ల చొప్పున జరిమాన

Maskలు ధరించని 3 వేలమందికి Fine

చెన్నై, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో, వాహనాల్లో సంచరించిన మూడువేలమందికి తలా రూ.500ల చొప్పున జరిమాన విధించినట్లు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. చెన్నై సహా అన్ని జిల్లాల్లో బుధవారం నుండి మాస్కులు ధరించనివారికి జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు.


కోయంబేడు మార్కెట్‌లో 10 మందికి కరోనా...

ఇదిలా ఉండగా స్థానిక కోయంబేడు కాయగూరల మార్కెట్‌లో 10 మందికి కరోనా సోకింది. ఆ మార్కెట్‌లోని వ్యాపారులు, దుకాణాల వద్ద పనిచేస్తున్న కార్మికులు సహా 1818 మందికి రెండు రోజులకు ముందు కరోనా ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలలో పదిమందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి.

Updated Date - 2022-07-08T14:45:40+05:30 IST