మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..!

ABN , First Publish Date - 2021-06-18T05:25:16+05:30 IST

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..!

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..!
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లమ్మ

తల్లిపై కుమారుడి హత్యాయత్నం 

- ఆమె పరిస్థితి విషమం 

- సూదికొండకాలనీలో ఘటన

పలాస, జూన్‌ 17: మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని వృద్ధురాలైన తల్లి పైనే దాడిచేశాడు ఓ ప్రబుద్ధుడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇం దుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంపతిరావు ఢిల్లమ్మ అనే వృద్ధురాలు కుమారుడు పురుషోత్తంతో కలిసి స్థానిక సూదికొండ కాలనీలో నివాసముంటోంది. పురుషోత్తం ఏ పనీ లేకుండా సోమరిగా తిరుగుతుం టాడు. తల్లి సంపాదనపై ఆధారపడుతుంటాడు. నిత్యం డబ్బులు ఇవ్వమని వేధిస్తుంటాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లిని అడిగాడు. తాను ఇవ్వనని..తాగుడు మానుకోవాలని తల్లి సూచించింది. దీంతో కోపోద్రి క్తుడైన పురుషోత్తం ఇంట్లో ఉన్న ఇనుపరాడ్డుతో తల్లి తలపై మోదాడు. ఇరుగు పొరుగువారు గమనించి రక్తపుమడుగులో ఉన్న ఢిల్లమ్మను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. సీఐ శంకరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కుమారుడు పురుషోత్తంపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. 

 

Updated Date - 2021-06-18T05:25:16+05:30 IST