కరోనా టీకాపై అపోహలొద్దు
ABN , First Publish Date - 2021-03-03T06:59:07+05:30 IST
కరోనా టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని విద్యాశాఖ మంత్రి ఆదిపూలపు సురేష్ సూచించారు.
ప్రతి ఒక్కరూ వేయించుకోవాలి
మంత్రి సురేష్
ఎర్రగొండపాలెం, మార్చి 2 : కరోనా టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని విద్యాశాఖ మంత్రి ఆదిపూలపు సురేష్ సూచించారు. అధైర్యపడ వద్దని సూచించారు. ఎర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆయన మంగళవారం కరోనా టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు పాల్, వైసీపీ నాయకులు కిరణ్గౌడ్, మూర్తిరెడ్డి పాల్గొన్నారు.