నగదు ఇన్ఫ్యూజన్‌కు ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదు...

ABN , First Publish Date - 2021-12-08T20:02:33+05:30 IST

ఓవర్సీస్‌ సహా బ్యాంకులు తమ శాఖల్లో... నగదును ఇన్ఫ్యూజ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అనుమతి అవసరం లేదని కేంద్రబ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

నగదు ఇన్ఫ్యూజన్‌కు ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదు...

ముంబై : ఓవర్సీస్‌ సహా బ్యాంకులు తమ  శాఖల్లో... నగదును  ఇన్ఫ్యూజ్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అనుమతి అవసరం లేదని కేంద్రబ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అలాగే... ఫీచర్ ఫోన్ వినియోగదారులకు కూడా యూపీఐ ఆధారిత పేమెంట్ ఉత్పత్తులను ప్రారంభించే ప్రతిపాదన ఉందని తెలిపారు. భారత ఆర్థికవ్యవస్థ రికవరీ బాట పట్టిందని, అయితే ఒమైక్రాన్ వేరియంట్ ప్రభావం చూపుతోంని పేర్కొన్నారు. సెకండ్ వేవ్ ట్రాక్షన్ కారణంగా రికవరీకి అంతరాయమేర్పడిందని తెలిపారు. 


ఒమైక్రాన్ అనిశ్చితి...

కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపధ్యంలో ఆర్థిక పరిస్థితి అనిశ్చితిగా ఉందని, ద్రవ్యోల్భణం వృద్ధి పై  కూడా భారీ అనిశ్చితి కొనసాగుతోందని శక్తికాంత దాస్ అన్నారు. లిక్విడిటీ పరిస్థితులకు అంతరాయం కలిగించని రీతిలో రీ బ్యాలెన్స్‌ను కొనసాగిస్తామని వివరించారు. మెయిన్ లిక్విడిటీ ఆపరేషన్‌గా... పధ్నాలుగు రోజుల వేరియేబుల్ రివర్స్ రెపో రేటు(వీఆర్‌ఆర్‌ఆర్)ను తిరిగి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డిసెంబరు 17 న జరిగనున్న  వీఆర్ఆర్ఆర్ వేలం ద్వారా రూ. 6.5 లక్షల కోట్లను సమీకరిస్తుందని, డిసెంబరు 31 న జరిగే వీఆర్ఆర్ఆర్ వేలం ద్వారా రూ. 7.5 లక్షల కోట్లను సమీకరిస్తుందని తెలిపారు. టీఎల్టీఆర్‌ఓలకు సంబంధించి... బ్యాంకులు వన్ టైమ్ ప్రీ పేమెంట్ చేయడానికి ఆర్‌బీఐ అనుమతిస్తుందని తెలిపారు. 


 ఫీచర్ ఫోన్ ఆధారిత ఉత్పత్తులు డిజిటల్ చెల్లింపులపై ఆర్‌బీఐ చర్చా పత్రాన్ని విడుదల చేయనుందని శక్తికాంత దాస్ తెలిపారు. అంటే డిజిటల్ పేమెంట్స్ ఛార్జీలకు సంబంధించి చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) ఆధారిత ఫీచర్ ఫోన్ ఉత్పత్తులను కూడా ప్రారంభిస్తుందన్నారు. గిల్ట్స్, రిటైల్, ఐపీఓలకు యూపీఐ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కరోనా ముందుస్థాయికి చేరుకుంటున్నాయని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. 


ద్రవ్యలభ్యత...

కరోనా సంక్షోభం నుండి ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుండడంతో ద్రవ్యలభ్యతను తగ్గించే దిశగా ఆర్‌బీఐ చర్యలు చేపట్టనుందని అందరూ భావించిన విషయం తెలిసిందే. జీఎస్‌టీ వసూళ్లు పెరగడం, తయారీ, సేవా పీఎంఐ గాడినపడడం దోహదపడ్డాయి. అయితే... ఒమైక్రాన్ ఈ పరిస్థితిని తలకిందులు చేసింది. ఈ వేరియంట్ నేపధ్యంలో... ప్రమాదం ఉండకపోవచ్చుననే అంచనాలున్నప్పటికీ, ఇన్వెస్టర్ల అనిశ్చితి, మార్కెట్ అనిశ్చితికి కారణంగా మారింది. ఈ నేపధ్యంలో ఈసారి కూడా వడ్డీ రేటును స్థిరంగా కొనసాగించారు. సెమీకండక్టర్ల కొరత, కమోడిటీ ధరలు పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ ఒడిదుడుకుల నేపధ్యంలో... ఈ ఏడాది ద్రవ్యోల్భణం 5.3 శాతంగా అంచనా వేసింది. అక్టోబరు-డిసెంబరు కాలంలో 5.1 శాతం, జనవరి-మార్చి కాలంలో 5.7 శాతం, ఏప్రిల్-జూన్ కాలంలో 5 శాతం, జూలై-సెప్టెంబరు కాలంలో 5 శాతంగా అంచనా వేసింది. వృద్ధిరేటు అంచనాలను 9.5 శాతంగా కొనసాగించింది. అక్టోబరు-డిసెంబరు కాలంలో 6.6 శాతం, జనవరి-మార్చి కాలంలో 6.4 శాతం, ఏప్రిల్-జూన్ కాలంలో 17.2 శాతం, జూలై-సెప్టెంబరు కాలంలో 7.8 శాతంగా అంచనా వేసింది. 

Updated Date - 2021-12-08T20:02:33+05:30 IST